NEET UG 2026: ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
హైదరాబాద్, మే 4: నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 3) ప్రశాంతంగా జరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22, 75,001 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 22,09,318 మంది ఈ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో రాశారు. అంటే 97 శాతం మంది పరీక్ష రాశారు. తమిళనాడులో అత్యధికంగా 1.4 లక్షల మంది రాశారు. దేశంలోని 552 నగరాల్లో, విదేశాల్లోని 14 సిటీల్లో కలిపి మొత్తం 5,432 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది….