ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!
బీహార్లోని సహర్సా జిల్లాలో ఒక వివాహ వేడుక రణరంగంగా మారింది. వివాహానంతరం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన ఆహారం విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. చివరకు పెద్ద హింసాత్మక ఘర్షణకు దారితీసింది. తమకు పెళ్లిలో మటన్ వడ్డిస్తామని వాగ్దానం చేసి, భోజనాల సమయంలో ప్లేట్లలో చికెన్ వడ్డించారంటూ వరుడి తరఫు వారు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం కాస్తా ఇరుపక్షాల మధ్య దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో వరుడి తరఫున వచ్చిన ఆరుగురికి పైగా…