Telangana: కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రెడీ.. 5 ఏళ్లలో 200 కొత్త రైళ్లు.. సామాన్యులు, విద్యార్థులకు ఇక పండగే..
తెలంగాణలో మరో చారిత్రాత్మక రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. భారతీయ రైల్వేస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం నుండి.. రాబోయే ఐదేళ్లలో వందలాది సరికొత్త ఇంటర్సిటీ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూలు ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించారు….