కొత్త రూల్స్‌.. ఇకపై LPG సిలిండర్లు నేరుగా అక్కడి నుంచి పొందలేరు!

కొత్త రూల్స్‌.. ఇకపై LPG సిలిండర్లు నేరుగా అక్కడి నుంచి పొందలేరు!


కొత్త రూల్స్‌.. ఇకపై LPG సిలిండర్లు నేరుగా అక్కడి నుంచి పొందలేరు!

ఢిల్లీలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం గిడ్డంగుల నుంచి నేరుగా ఎల్పీజీ సిలిండర్ల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. అధికారిక ప్రకటన ప్రకారం బుక్ చేసుకున్న సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు నిర్దిష్ట సమయానికి చేరుతున్నందున, ప్రజలు గ్యాస్ ఏజెన్సీలు లేదా నిల్వ కేంద్రాలకు వెళ్లవద్దని సూచించారు. గుంపులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పంపిణీదారులకు గిడ్డంగుల నుంచి నేరుగా అమ్మకాలు చట్టవిరుద్ధమని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాయి.

ఇదిలా ఉండగా వలస కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచారు. చిరునామా ధృవీకరణ అవసరం లేకుండా, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించడం ద్వారా ఈ సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీల నుంచి పొందవచ్చు. వినియోగదారులకు సమాచారం అందించేందుకు ఎంపిక చేసిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ అవుట్‌లెట్లలో 11 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరఫరా పరిస్థితిని బలపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్ 4న 1.14 లక్షలకుపైగా బుకింగ్‌లు నమోదవగా, 1.31 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం సగటు గృహ డెలివరీ సమయం 4.24 రోజులు గా ఉంది.

బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. అదనంగా ఢిల్లీ పోలీస్‌ 17 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా ఆహార, సరఫరాల శాఖ 76 గ్యాస్ ఏజెన్సీలు, నిల్వ కేంద్రాలను తనిఖీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారిక సరఫరా వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *