కావాల్సిన పదార్దాలు: అర కిలో మటన్, రెండు కప్పుల చుక్కకూర, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.
ముందుగా మటన్ను తీసుకుని బాగా కడిగి, పసుపు , ఉప్పు కూడా ప్రెజర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.
ఇక ఇప్పుడు పాన్ తీసుకుని నూనెను వేడి చేసి దానిలో కరివేపాకు ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి.
ఆ తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇక ఇప్పుడు ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దానిని కలపాలి. ఆ తరువాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యేదాకా బాగా ఉడికించాలి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడికించిన మటన్ను దీనిలో వేసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి.
ఇక ఆ తర్వాత ముందుగా తరగి పక్కన పెట్టుకున్న చుక్కకూరను వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చుక్కకూరతో మటన్ ముక్కలు కలిసి పోయే వరకు దీనిని బాగా కలుపుతూ వండాలి. చివర్లో మసాలా పొడి వేసి 4 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి.




