హిందూ మతంలో జ్యోతిష్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొంత మంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తే, మరికొంత మంది వీటిని ఎక్కువగా నమ్ముతారు. ఇక వీటిలో అనేక రకాలు ఉంటాయి. హస్త సాముద్రిక, గోచార ఫలం, రాశిఫలం, కుండలి జ్యోతిష్యం, రాశిఫలం, నక్షత్రం ఆధారంగా, న్యూమరాలజీ ఇలా అనేక రకాలుగా చాలా మంది జోస్యం చెప్పించుకుంటారు.
ఇక ముఖ్యంగా చిలుక జోస్యం, సోది చెప్పించుకోవడం చేస్తుంటారు. కానీ ఇవేవి కాకుండా పందితో కూడా జోస్యం చెప్పించుకుంటారంట. ఇదెక్కడా, వినడానికే విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం దీని గురించే వివరంగా తెలుసుకుందాం.
తిరుపతి చెన్నై జాతీయ రహదారిలో ఉన్న అంజేరమా దేవాలయం, చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ గుడి వద్దకు ఆది వారం అయితే చాలు వేలమందిలో భక్తులు వచ్చి ముక్కులు అప్ప జెప్పి, జంతు బలులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ చిలుకతో కాకుండా ఒక పెద్దాయన పందితో జోస్యం చెప్పించడం అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా మంది ఈయన దగ్గర పందితో జోస్యం చెప్పించుకుంటారంట.
చిలుక ఎలాగైతే బోను నుంచి బయటకు వచ్చి చీటీ తీస్తుందో, ఈ పంది కూడా అలానే వచ్చి చీటి తీస్తుంది. అలా దానిలో ఉన్నది జాతకంగా చెబుతుంటారు. అయితే చాలా మంది పంది అంటే పెద్దగా ఉంటుందని అనుకుంటారు కానీ ఇది అచ్చం ఎలుకలా ఉంటుంది. ఎలుకల జాతికి చెందినవి. కానీ వీటిని అందరూ గినియా పిగ్ అని పిలుస్తారు. ఈ పందులు పెంపుడు జంతువులు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గినియా పంది జాతులు అనేక రకాలుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి వంటివి తిని జీవిస్తాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




