ప్రసవం తర్వాత బాలింతల కోసం కరివేపాకు కారం పొడి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది నోటికి రుచిని మాత్రమేకాదు ఒంటికి శక్తిని ఇస్తుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు.. కరివేపాకు 4 కప్పులు (శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టినవి), ఎండు మిరపకాయలు – 20 నుండి 25, ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, ఉప్పు – తగినంత, నూనె 1 టీ స్పూన్ (ఐచ్ఛికం) తీసుకోవాలి.