తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు


తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ఆయిల్ కంపెనీల నుండి సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా, ప్రధాన నగరాల నుండి గ్రామాల వరకు పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. దాదాపు అన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పొలం పనులకు కీలకమైన సీజన్ కావడంతో, ఈ ఇంధన కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. డీజిల్ లేక ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వ్యవసాయ యంత్రాలు ఆగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేసవి ఎండలను కూడా లెక్కచేయకుండా, తెల్లవారుజామునే పీపాలు, డ్రమ్ములతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఇంధనం దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బాటిళ్లు, డ్రమ్ములలో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో బంకుల వద్ద తోపులాటలు, వాగ్వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు మధ్య ఇంధన పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. భైంసా వంటి పట్టణాల్లో రోజుల తరబడి పెట్రోల్ లేక వాహనదారులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు, ఈ సంక్షోభాన్ని కొందరు అక్రమార్కులు అవకాశంగా మార్చుకుంటున్నారు. కడప జిల్లా బద్వేల్ వంటి ప్రాంతాల్లో బంకు సిబ్బంది వాహనదారులకు ఇంధనం ఇవ్వకుండా, డ్రమ్ములలో నింపి అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటరుపై 20 నుండి 30 రూపాయల వరకు అదనపు ధర వసూలు చేస్తున్నారని కస్టమర్లు మండిపడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారం చేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సరఫరా సక్రమంగా లేకపోతే రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏపీ నుంచి ఖమ్మం సరిహద్దు ప్రాంతాలకు వాహనదారులు భారీగా తరలిరావడంతో, అక్కడ కూడా రద్దీ పెరిగిపోయింది. తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని, ఆయిల్ కంపెనీల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ

Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *