Headlines

IND vs AFG: టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌ ఔట్.. ఎందుకంటే?


Afghanistan vs India, 1st T20I: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు మొదలైంది. ఈ 3 మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లు భారతదేశంలో జరుగుతున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్య జట్టుగా, భారత్ పర్యటక జట్టుగా ఉంటుంది. 94 ఏళ్లలో ఇలాంటి క్రికెట్ సిరీస్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడమే. భద్రతా కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ స్వదేశంలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు, కాబట్టి దాని స్వదేశీ మ్యాచ్‌లు భారతదేశం లేదా యూఏఈలో జరుగుతాయి.

ఇది టీమ్ ఇండియాకు ఒక కొత్త అనుభవం కానుంది. భారత క్రికెట్ 94 ఏళ్ల చరిత్రలో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడబోవడం, కానీ ఆతిథ్య జట్టుగా ఉండకపోవడం ఇదే మొదటిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *