
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ నయనతార.భర్త విగ్నేష్ శివన్ కలిసి తో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సొంత బ్యానర్ పై నిర్మించిన లైక్ మూవీ విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు నయనతార దంపతులు తిరుమలలు వచ్చారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్ లకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన నయనతార, విగ్నేష్ లు భక్తులతో ముచ్చటించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించిన వారితో ఫోటోలు దిగారు.