బంగారం కొనుగోలుచేసేవారికి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ఉన్నట్లుండి ధరలు హైక్ అయ్యాయి. మొన్నటివరకు ధరలు పడిపోగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, ట్రంప్ ప్రకటనలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం బంగారం ధరలపై పడింది. శనివారం బంగారం, వెండి ధరలు దేశంలోని వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.
హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతోంది. ఇక నిన్న రూ.1,52,350గా ఉండగా.. నిన్నటితో చూసుకుంటే రూ.490 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,40,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,39,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.450 పెరిగిందని చెప్పవచ్చు.
అటు చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,820 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,54,090గా ఉంది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,41,000గా ఉండగా.. శుక్రవారం రూ.1,41,250 వద్ద స్ధిరపడింది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,840 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,100 వద్ద స్ధిరపడింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,52,990 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,250 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల రేటు రూ.1,52,840 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,100 వద్ద ఉంది.
ఇక వెండి ధరలు చూస్తే.. ముంబైలో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి రూ.2.65 లక్షల వద్ద ఉండగా.. చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. మొత్తానికి బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ఇంకెంత కాలం కొనసాగుతుందనేది చూడాలి.




