Headlines

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More

Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం

Viral: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా తెచ్చిన హైపు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అయ్యప్ప మాల ధరించినట్లు ఉన్న ఫ్యాన్ ఎడిట్ ఫొటోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉన్న డేవిడ్ వార్నర్‌కు ఇక్కడి సినిమాలు, పాటలంటే…

Read More

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్యపై మెజిస్టీరియల్ విచారణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనా వుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే…

Read More

 ఇరాన్ నుంచి ఆ నౌక వస్తోంది..  థాయ్ సెక్స్ వర్కర్ల పై పోలీసుల దాడులు..!

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి  సముద్ర జలాల్లో  మోహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్’ ఎట్టకేలకు అమెరికాకు వెనుదిరిగింది. ఈ నౌకలో దాదాపు 5,000 మంది అమెరికా సైనికులున్నారు. గత 200 రోజులకు పైగా వీరు సముద్రంలోనే ఉండిపోవడంతో, కనీస సౌకర్యాలు అందక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ ఒత్తిడి కారణంగా కొందరు నావికులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నౌక…

Read More

Sachin Joshi : హీరో సచిన్ జోషి గుర్తున్నాడా.. ? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరంటే..

సినీ పరిశ్రమలోకి ప్రతిరోజూ ఎంతోమంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే వరుస విజయాలతో రాణిస్తే, మరికొందరు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేక సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఒకరు. అయితే ఆయన భార్య కూడా ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ వ్యాపారవేత్త జె.ఎమ్. జోషి కుమారుడైన సచిన్ జోషి, నటనపై ఉన్న ఆసక్తితో 2002లో ‘మౌనమేలనోయి’ చిత్రంతో…

Read More

ఎందుకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంత పెద్ద హిట్ అయింది? ఆసక్తికర కారణాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. డ్రాగన్లు, రాజ్యాలు, యుద్ధాలు, కుట్రలు, ప్రేమలు, ద్రోహాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్.. టీవీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది. ఐరన్ థ్రోన్‌పై ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే కథకు కేంద్రబిందువు. వెస్టెరోస్‌లోని రాజ కుటుంబాలు, శక్తివంతమైన నాయకులు, యోధులు.. తమకు కావాల్సిన అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఎవరు ఎప్పుడు మిత్రుడిగా మారతారో, ఎప్పుడు శత్రువుగా మారతారో…

Read More

ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి

అన్నం, చపాతీ రెండూ ధాన్యాలతో తయారయ్యే ఆహారాలే. వీటి ద్వారా ప్రధానంగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఒకే భోజనంలో రెండింటినీ ఎక్కువగా తీసుకుంటే మొత్తం కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య అన్నం, చపాతీ కలిపి తినడంలో కంటే.. వాటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే దానిలో ఎక్కువగా ఉంటుంది. అన్నం, చపాతీ కలిపి తింటే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయా? అన్నం, చపాతీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి రెండింటినీ అధిక పరిమాణంలో ఒకేసారి తినడం వల్ల…

Read More

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..? అసలు విషయం ఇదే

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్.? ఇప్పుడు ఇదే టాపిక్ అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌ను 50 ఏళ్ల సిమ్రాన్ మెడలో పూలదండ వేసి అతడిని హత్తుకుని కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సిమ్రాన్ జయరామ్ ను నిజంగానే పెళ్లి…

Read More

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..?

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా…

Read More

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read More