Viral Video: రోడ్డుపై నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో రైల్వే స్టేషన్లో నిమ్మరసం విక్రయిస్తున్న ఓ వ్యక్తి, పబ్లిక్ రెస్ట్రూమ్ నుంచి నీటిని తీసుకొచ్చి నిమ్మరసం తయారీలో కలిపినట్లు ఆరోపిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రజారోగ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియోలో ఒక నిమ్మరసం విక్రేత తన బండి వద్ద నుంచి వెళ్లి సమీపంలోని పబ్లిక్…