Krishna Vamsi: ఆ నటుడి విషయంలో తొందరపడ్డాను.. తప్పు నాదే.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్ వైరల్..
తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్, నటన, వివాదాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. 1995లో గులాబి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా, సిందూరం, అంతఃపురం, ఖడ్గం, రాఖీ, గోవిందుడు అందరివాడేలే వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు అందుకున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుతో గతంలో జరిగిన వివాదంపై…