గేమింగ్ లవర్స్కు షాక్..! 2028 నుంచి వాటిని ఆపేయాలని సోనీ కీలక నిర్ణయం
గేమింగ్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ఫిజికల్ కాపీల ద్వారా ఆటలను సొంతం చేసుకునే సంప్రదాయానికి సోనీ (Sony) స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 2028, జనవరి నుంచి కొత్తగా విడుదలయ్యే ఏ ప్లేస్టేషన్ గేమ్ కూడా ఫిజికల్ డిస్క్ రూపంలో రాదని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వినియోగదారుల ప్రాధాన్యతలు డిజిటల్ మాధ్యమం వైపు భారీగా మళ్లుతున్న తరుణంలో, ఈ మార్పు సహజమైనదని సోనీ పేర్కొంది. ఫిజికల్ డిస్క్ల ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా పూర్తిగా డిజిటల్ ఫార్మాట్కు మారనున్నట్లు…