Watch: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఒక్క కాల్ చేస్తే ఇంటికే.. ఆనంద్ మహింద్రానే ఫిదా చేసిన ఐడియా

Watch: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఒక్క కాల్ చేస్తే ఇంటికే.. ఆనంద్ మహింద్రానే ఫిదా చేసిన ఐడియా


Watch: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఒక్క కాల్ చేస్తే ఇంటికే.. ఆనంద్ మహింద్రానే ఫిదా చేసిన ఐడియా

భారతదేశంలో డిజిటల్ సేవల విస్తరణ వేగంగా జరుగుతోంది. దీని ప్రభావం ఇకపై నగరాలకే పరిమితం కాకుండా, సాంప్రదాయ ఉద్యోగాలను కూడా తాకింది. ఇటీవల, కేరళకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కొబ్బరికాయలు కోసే కార్మికుడిని, దాదాపు ఉబెర్ లాగానే బుక్ చేసుకోవడం కనిపించింది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కేరళలో ఇప్పుడు క్యాబ్‌లను పిలిచినట్లే కొబ్బరి కోత కార్మికులను కూడా పిలవవచ్చని ఆయన వివరించారు. బుకింగ్ చేసుకున్న తర్వాత, శిక్షణ పొందిన వ్యక్తి యూనిఫాంలో, సైకిల్‌పై తన పరికరాలతో పని చేయడానికి సిద్ధంగా వస్తాడు.

కేరళ అంటేనే కొబ్బరి చెట్లు గుర్తుకొస్తాయి. అయితే, ఈ కొబ్బరి కాయలను కోయడానికి ఇప్పుడు మనుషులు దొరకడం గగనమైపోయింది. ఈ సమస్యకు కేరళ ప్రభుత్వం, అక్కడి స్థానిక సంస్థలు కలిసి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. అదే హలో నారియల్ (Hello Nariyal) సర్వీస్. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా, ఈ సేవకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత అంటే కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అది సామాన్యుడి సమస్యలను ఎలా తీరుస్తుందనేది ముఖ్యం. కేరళలోని ఈ పద్ధతి అద్భుతం! అని ఆయన కొనియాడారు.

ఇది ఎలా పనిచేస్తుంది?:

కొబ్బరి తోటల యజమానులు కేవలం ఒక నిర్ణీత నంబర్‌కు ఫోన్ చేసి లేదా యాప్ ద్వారా తమ అభ్యర్థనను నమోదు చేసుకోవచ్చు. పాత కాలంలాగా ప్రాణాలకు తెగించి చెట్లు ఎక్కే పని లేకుండా, ఇప్పుడు ఆధునిక ట్రీ క్లైంబింగ్ యంత్రాలను వాడుతున్నారు. దీనివల్ల పని వేగంగా, సురక్షితంగా పూర్తవుతుంది. శిక్షణ పొందిన యువకులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు కొబ్బరి కోయడమే కాకుండా, చెట్టుకు సోకే తెగుళ్లను గుర్తించి యజమానులకు సలహాలు కూడా ఇస్తారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ పథకం ద్వారా కేరళలో వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తోంది. మహిళలు కూడా ఈ యంత్రాలను సులభంగా ఆపరేట్ చేస్తూ కొబ్బరి కోత పనుల్లో పాల్గొనడం విశేషం. సాంకేతికత సాయంతో వ్యవసాయం ఎంత సులభతరం అవుతుందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇలాంటి వినూత్న ఆలోచనలు దేశమంతటా వస్తే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *