క్షణాల్లో మంటల్లో కాలిపోయిన కారు.. రెప్పపాటు తప్పించుకున్న ప్రయాణికులు!
సిద్దిపేట: రాజీవ్ రహదారిపై కదులుతున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనం నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కొల్తూరు నుంచి నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో గజ్వేల్ వైపు బయలుదేరారు. రాజీవ్…