Drug Free State: డ్రగ్స్పై ఉక్కుపాదం.. ఏకంగా రూ.2,212 కోట్ల మత్తుపదార్థాల ధ్వంసం!
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గుజరాత్ ను మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 2,212 కోట్ల భారీ విలువైన మత్తుపదార్థాలను అధికారులు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా నాశనం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)…