Headlines

Gautam Gambhir: గంభీర్ పోస్ట్ పీకేసే డేట్ ఫిక్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఎప్పుడంటే?

Gautam Gambhir: గంభీర్ పోస్ట్ పీకేసే డేట్ ఫిక్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఎప్పుడంటే?


Gautam Gambhir head coach sack date: భారత క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో పీకల్లోతు కష్టాల్లో పడటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి మునిగిపోయే రోజు దగ్గరపడింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీం ఇండియా ఘోరంగా వైట్‌వాష్ కావడంతో గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కోచ్ పదవి నుంచి తొలగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్ అభిమానులకు గత కొన్ని రోజులుగా తీవ్ర నిరాశే ఎదురవుతోంది. రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న తర్వాత ఎన్నో ఆశలతో కోచ్ పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఆయన కోచింగ్‌లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినప్పటికీ, ఆ తర్వాత జట్టు ప్రదర్శన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గంభీర్ నేతృత్వంలోని ప్రపంచ ఛాంపియన్ భారత్.. వరుసగా ఆరు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో గంభీర్ కోచ్‌ పదవికి ఎసరు వచ్చింది.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి



ఆ రోజే గంభీర్ ఆఖరి రోజు.. బీసీసీఐ వ్యూహం ఏంటి?

వరుస ఓటములతో ఆగ్రహంతో ఉన్న అభిమానులు, మాజీ క్రికెటర్లు గంభీర్‌ను తక్షణమే కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పుడే తొందరపడి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దని భావిస్తోంది. కొత్త కోచ్‌ను అకస్మాత్తుగా నియమిస్తే అది డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని బోర్డు పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

అందువల్ల, వచ్చే 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027) వరకు గంభీర్ పదవికి ఎలాంటి ఢోకా ఉండదని సమాచారం. ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన మరుసటి రోజే గంభీర్‌కు బీసీసీఐ వీడ్కోలు పలకనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే 2027 ప్రపంచకప్ టోర్నీనే కోచ్‌గా గంభీర్‌కు ఆఖరి అవకాశం కానుంది. ఒకవేళ అక్కడ కూడా జట్టు విఫలమైతే ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయం.

ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలోనే సహాయక కోచ్ గుడ్ బై..!

భారత జట్టు అంతర్గత పరిణామాల్లో మరో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలోనే భారత జట్టు సహాయక కోచ్ (అసిస్టెంట్ కోచ్) రయాన్ టెన్ డోషేట్ (Ryan ten Doeschate) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీం ఇండియా కోచింగ్ సిబ్బంది నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆయన ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి అధికారికంగా తెలియజేశారు. ఎలాంటి విభేదాలు లేకుండా, పరస్పర అంగీకారంతోనే ఆయన జట్టుకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాగుతున్న భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మాత్రమే రయాన్ కెరీర్‌లో ఆఖరిది కానుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *