సంక్షోభ వేళ భారత్ శక్తివంతమైన దౌత్యానికి మరో నిదర్శనం
ప్రపంచ రాజకీయాలు అత్యంత సంక్లిష్ట దశలో ఉన్న వేళ భారత్ మరోసారి తన సమతుల్య విదేశాంగ విధానాన్ని చాటుకుంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖామెనీ అంత్యక్రియలకు భారత అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ను తమకు అత్యంత బలమైన మద్దతుదారుల్లో ఒకటిగా అభివర్ణించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. అలీ ఖామెనీ మరణం అనంతరం టెహ్రాన్లో జరిగిన అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయ…