ఇక దేశవ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశాలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 23 నాటికి రుతుపవనాల ఉత్తర సరిహద్దు దహను, వార్ధా, రాయ్పూర్, డాల్టన్గంజ్, మోతిహారి ప్రాంతాల గుండా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.