Headlines

మరోసారి నిరాశపరిచిన శాంసన్.. వైభవ్ ఉసురు తగిలిద్దంటూ ఫ్యాన్స్ కామెంట్స్..!


ఢిల్లీలో జరుగుతున్న మొదటి టీ20 సమరంలో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) అర్ధశతకం సాయంతో 156 పరుగుల పోరాడే స్కోరు సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ రెండు బౌండరీలతో మంచి ఆరంభం ఇచ్చినట్లే కనిపించాడు. ఆ వెంటనే ఒమర్జాయ్ వేసిన బంతిని పుల్ చేయబోయి సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో 8 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వరుసగా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో శాంసన్ విఫలం కావడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కి తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సమయంలోనే వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు, శాంసన్ తాజా వైఫల్యంతో మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. శాంసన్ తన ఆటతీరును మార్చుకోవాలని, లేదంటే రిటైర్మెంట్ ప్రకటించి యువ ఆటగాళ్లకు దారి ఇవ్వాలని నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి



గణాంకాలను పరిశీలిస్తే, 2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తరువాత ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో శాంసన్ కేవలం 8.6 సగటుతో 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లలో ఆకట్టుకున్నప్పటికీ, కెరీర్ ఆరంభం మొదలుకొని నిలకడలేమి సమస్య అతడిని వెంటాడుతూనే ఉంది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యం అతడి టీ20 భవిష్యత్తుపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *