Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్యపై మెజిస్టీరియల్ విచారణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనా వుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే…

Read More

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న భారం..

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…

Read More

iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? క్షణాల్లో తెలుసుకోండిలా?

iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీ మునుపటి కంటే వేగంగా అయిపోతుంటే, దానికి కారణం ఎల్లప్పుడూ బ్యాటరీ పాడవ్వడమే కాదు. కొన్నిసార్లు, కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం నడుస్తూ, ఎవరికీ తెలియకుండా చాలా బ్యాటరీని వాడుకుంటాయి. అయితే ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుతున్నాయో సులభంగా గుర్తించడానికి ఐఫోన్‌లో ఒక ఫీచర్ ఉంది. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్‌లను ఎలా గుర్తించాలి? ముందుగా మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ను తెరవండి. కిందికి స్క్రోల్ చేసి, బ్యాటరీ ఆప్షన్‌ను…

Read More

ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు 20 మంది విద్యార్థులు!

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. నాలుగు అంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీస్, ఎంసీడీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే…

Read More

Tim Cook Net Worth: యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? యాపిల్ నుంచి తప్పుకున్నాక ఆయన కొత్త రోల్ ఏంటి?

Apple CEOగా దాదాపు 15 సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన టిమ్ కుక్ పదవీకాలం ముగిసింది. 2026 ఆగస్టు 31 CEOగా ఆయన చివరి రోజు సేవలు పూర్తయ్యాయి. అయితే, టిమ్ కుక్ Apple కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. ఆయన కంపెనీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి జాన్ టర్నస్ Apple కొత్త CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి…

Read More

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు

సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…

Read More

కొత్తగా పెళ్లైన జంటలు వింధ్యవాసిని అమ్మవారి దర్శనం ఎందుకు చేయాలి? ఈ క్షేత్రం ప్రత్యేకత ఇదే!

Vindhyavasini Amma Temple Telugu: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో పవిత్ర గంగా నది ఒడ్డున వెలసిన వింధ్యాచల్ ధామ్ ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వింధ్యవాసిని అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహిత జంటలు, కొత్తగా పెళ్లైన వధూవరులకు ఈ క్షేత్రం ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, వింధ్యవాసిని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రార్థిస్తే వైవాహిక జీవితంలో ఆనందం,…

Read More

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. రేపే చివరి అవకాశం.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం మంచిది. లేకపోతే గ్యాస్ సబ్సిడీ నగదు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇంతకముందు ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఆలస్యం…

Read More

Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..?

వాట్సప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలతో డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇతరుల నుంచి మీరు డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ తమ డిజిటల్…

Read More

తెలుగు అక్షరాలతో అద్భుత పట్టు చీర.. సిరిసిల్ల కళాకారుడి వినూత్న ఆలోచనకు జేజేలు!

తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్. చేనేత మగ్గంపై నూలుతో ఎన్నో రకాల డిజైన్లను ఆవిష్కరించే ఆయన.. ఈసారి తెలుగు భాషలోని అక్షరాలనే చీరకు అందమైన డిజైన్లుగా మలిచారు. ఏకంగా 56 తెలుగు అక్షరమాలను పట్టు చీరపై కళాత్మకంగా డిజైన్ చేసి, తెలుగు భాషకు చేనేత కళ ద్వారా నీరాజనం పలికారు. సాధారణంగా పట్టు చీరలపై పూలు, ఆకులు, నెమళ్లు, సంప్రదాయ డిజైన్లు,…

Read More