Telangana: రైతన్నలకు సూపర్ గుడ్న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోచే గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండగా, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంపై దృష్టి సారించింది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలనే…