దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా..
బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశం విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు. దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ.. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలోనూ ఓ చారిత్రాత్మక ఘట్టం జరిగింది. గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అది కేవలం జెండా ఆవిష్కరణ కాదు.. స్వాతంత్ర్య సమర యోధుల…