Fact Check: ప్రధాని మోదీ పేరుతో ‘ఉచిత సైకిల్’ వీడియో వైరల్.. నమ్మితే నిలువునా మునుగుతారు!
ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) రంగంలోకి దిగి అసలు రూపాన్ని బట్టబయలు చేసింది. పీఐబీ…