బంగారం, వెండి, దేశీ నెయ్యి, ఆవనూనె.. ఇవి ప్రతి భారతీయ ఇంట్లోనూ ఉండే వస్తువులు. కానీ మార్కెట్లో పెరుగుతున్న కల్తీల కారణంగా మనం కొనే వస్తువు 100 శాతం అసలైందో కాదో గుర్తించడం కష్టంగా మారింది. ప్రజలు తరచూ సోషల్ మీడియాలో చూసో లేదా పెద్దల ద్వారా వినో రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నించి వాటి ప్యూరిటీని చెక్ చేస్తూ ఉంటారు. ఐస్ ముక్కతో వెండిని గుర్తించవచ్చని కొందరు చెబితే, అయస్కాంతంతో బంగారాన్ని పరీక్షించవచ్చని మరికొందరు అంటారు. అయితే, ఈ చిట్కాల వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా లేక ఇవన్నీ కేవలం ప్రచారంలో ఉన్న మాటలేనా? అనేది చూద్దాం.