Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!
హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్ఆర్ ఫంక్షన్…