Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త.. త్వరలోనే అవి కూడా పంపిణీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రేషన్ కార్డుదారులకు జొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి ప్రభుత్వం వీటిని సేకరించి రేషన్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేయనుంది. మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అనంతరం రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది. రైతుల నుంచి తీసుకున్న జొన్నలను బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడతారు. అదే దీనిని రేషన్ కార్డుదారులకు అందించడం…