Andhra News: రన్నింగ్ ట్రైన్ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్ చేయగా..
తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….