ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్టణంలోని వేమలి వీధిలో నివసించే ప్రజలు ఈ తోమడపు ఎద్దును ప్రత్యేక భక్తితో చూసేవారు. శుభకార్యాలు, పండుగలు, ఆలయ ఉత్సవాల సందర్భంగా ఎద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా…