Headlines
TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..

TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..

హైదరాబాద్- బెంగళూరు రూట్‌లో ప్రయాణించే వారికి మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం నగర ట్రాఫిక్ ఇబ్బందులను తప్పిస్తూ, సమయాన్ని ఆదా చేసే ఉద్దేశ్యంతో పుష్పక్ ఏసీ ఫీడర్ అనే కొత్త సర్వీలసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సాధారణంగా మియాపూర్, నిజాంపేట్, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్,…

Read More
PM Modi: యుద్ధంతో నష్టం.. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

PM Modi: యుద్ధంతో నష్టం.. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని.. స్కైరూట్‌ సక్సెస్‌ కావడం దేశానికి గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు. 28 ఏళ్ల యువకులు ఈ ఘనతను సాధించారన్నారు. యువత సాహసాలు చేయడమే కాదు, సక్సెస్‌ అవుతున్నారని మోదీ తెలిపారు. రాజస్థాన్‌లో ఆయిల్‌ రిఫైనరీని దేశానికి అంకితంచేశామని.. సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ను ప్రారంభించుకున్నామని.. గ్రీన్‌…

Read More
కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

మ్యాక్యులర్ డీజనరేషన్‌తో బాధపడుతున్న వృద్ధులు ఈ చిప్ సహాయంతో మళ్లీ పుస్తకాలు చదువుతూ, పజిల్స్ పూరిస్తున్నారు. కంటి వెనుక భాగంలో అమర్చే ఈ మైక్రోచిప్, ప్రత్యేక కళ్లజోడు టెక్నాలజీతో వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్న ఈ ప్రిమా పరికరం పనితీరు, ఇతర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! మ్యాక్యులర్ డీజనరేషన్‌కు చెక్.. ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడిన లక్షలాది మంది ‘మ్యాక్యులర్ డీజనరేషన్’ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కంటి వెనుక భాగంలో కాంతిని గ్రహించే కణాలను నాశనం చేయడం వల్ల పుస్తకాలు…

Read More
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి చెక్ పెట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎవరైనా బహిరంగంగా మూత్రవిసర్జన చేసినా లేదా చెత్త వేసినా వాటిని రికార్డ్ చేస్తారు. ఆ దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తుల ఫొటోలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. ఈ ‘హాల్ ఆఫ్ షేమ్’ ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది తమ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్య నుండి సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఆకాశం మేఘావృతమై, ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్ ఎందుకులే అని అనుకోవడం సర్వసాధారణం. అయితే సన్‌స్క్రీన్ అనేది కేవలం ఎండ రోజుల్లో మాత్రమే వాడేది కాదని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్ని కాలాల్లోనూ వాడాల్సిన అత్యవసర రక్షణ కవచమని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో మేఘాలున్నా, వర్షం పడుతున్నా సన్‌స్క్రీన్‌ను ఎందుకు అస్సలు స్కిప్ చేయకూడదో.. ఈ వర్షాకాలంలో…

Read More
Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఆరోగ్య భద్రత అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా దేశంలోని ప్రైవేట్ హాస్పిటళ్లల్లో చికిత్స పొందవచ్చు. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో కోట్లాది మంది చేరగా.. అనేకమంది లబ్ది పొందుతున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్…

Read More
Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. నిజానికి భారీ అంచనాల మధ్య విడుదలై చివరకు నష్టాలను మిగిల్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ కలెక్షన్లతో సంబంధమే లేకుండా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అటువంటి సినిమాలనే కల్ట్ క్లాసిక్స్ అంటారు. అలాంటి ఒక సినిమా 2000వ సంవత్సరంలో విడుదలైంది. ఇందులో చాలా మంది సూపర్‌స్టార్లు నటించారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించినప్పటికీ,…

Read More
ICU నుంచి అక్కినేని పంపిన ఆఖరి సందేశం ఇదే.. కన్నీళ్లు ఆగవు..

ICU నుంచి అక్కినేని పంపిన ఆఖరి సందేశం ఇదే.. కన్నీళ్లు ఆగవు..

తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR). ఆయన 90 ఏళ్ల వయసులో 2014, జనవరి 22న ఈ లోకాన్ని వీడారు. చివరి రోజుల్లో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో తన అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం పంపిన ఓ ఆడియో సందేశం ఎందరినో కదిలించింది. ఈ సందేశాన్ని ఆ తర్వాతి కాలంలో ఓ బహిరంగ వేడుకలో ప్రసారం చేయగా.. ప్రముఖ నటులు చిరంజీవి, రమ్యకృష్ణన్ వంటి వారు సైతం భావోద్వేగానికి…

Read More
Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

ఈ కారప్పొడి కేవలం ఇడ్లీలకే కాకుండా గీ కారం దోశ, మసాలా దోశ, మినప వడలు, చివరికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులకు కమ్మటి రుచిని అందించండి.

Read More
Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ప్రస్తుతం పాపికొండలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలక ఆకర్షణగా నిలిచాయి. రాజమహేంద్రవరం, పోలవరం ప్రాంతాల నుంచి ప్రత్యేక బోటు యాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి అందాలు, గిరిజన జీవన విధానం, చారిత్రక విశ్వాసాలు కలిసి పాపికొండలను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాయి. పేరుకు సంబంధించిన కథనాల్లో ఏది పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించబడకపోయినా, ప్రకృతి సోయగాలు, పురాణ విశ్వాసాలు, స్థానిక సంస్కృతి కలయికే పాపికొండల ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, భక్తులు ఈ…

Read More