పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే మనుషులు ఇంకా ఉన్నారని నిరూపించింది ఈ ఘటన. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు, కేరళకు చెందిన ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి రావడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి, తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కేరళలోని పాలక్కాడ్కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న…