ప్రమీల, శరత్చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…