NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్ 138లో ఎనిమిది మంది మనోళ్లే!
హైదరాబాద్, జూలై 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ఫలితాలు గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీట్ ఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో దాదాపు 8 మంది ఏకంగా 690కిపైగా స్కోర్ సాధించారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో…