బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన బుధవారం (ఏప్రిల్ 29) సాయంత్రం వేంపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన, కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సమాధి…