RBI Notes: 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?

RBI Notes: 500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?


RBI Notes: భారత కరెన్సీ నోట్లు భారతదేశంలో ప్రధాన కరెన్సీగా ఉన్నాయి. భారత కరెన్సీ నోట్లను ముద్రించడం, జారీ చేయడం, వాటి చలామణిని పర్యవేక్షించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యత. ప్రస్తుతం, భారతదేశంలో చలామణిలో ఉన్న అత్యంత సాధారణ డినామినేషన్లు రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500. 2016 డీమోనిటైజేషన్ తర్వాత కరెన్సీ నోట్లలో అనేక కొత్త డిజైన్లు ప్రవేశపెట్టింది ఆర్బీఐ.

500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లా?

డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ, కరెన్సీ నోట్ల వాడకం తగ్గలేదు. ఫలితంగా దేశ ఆర్థిక కార్యకలాపాలలో కరెన్సీ నోట్లు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, రూపాయి నోట్ల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఆ క్రమంలో ప్రస్తుతం 700 రూపాయల నోట్ల ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలవుతున్నాయి. అంటే ఆర్‌బిఐ 500 రూపాయల నోట్లకు బదులుగా 700 రూపాయల నోట్లను జారీ చేయబోతోందనే సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: Fact Check: ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో విడుదలైన 700 రూపాయల నోటు ఫోటో ప్రకారం, దానిపై గాంధీజీ చిత్రం, అశోకచక్రం, నాసా, భారతదేశ పటం మొదలైనవి ఉన్నాయి. ఈ 700 రూపాయల నోట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని నేపథ్యంలో, ఈ 700 రూపాయల నోట్లు ఎప్పుడు చలామణిలోకి వస్తాయనే ప్రశ్న తలెత్తింది.

అయితే, ఆర్‌బిఐ నిజంగా 700 రూపాయల నోట్లను జారీ చేస్తుందా అని అడిగితే.. అలాంటిదేమి లేదని, 700 రూపాయల నోట్ల ప్రవేశం చిల్లర వ్యాపారులకు చాలా సమస్యలను సృష్టిస్తుంది. అందువల్ల 700 రూపాయల నోట్ల జారీ గురించి ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అబద్దమని, రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన ఏదీ చేయలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *