విహారయాత్రలో విషాదం.. ఏనుగు కింద నలిగి మహిళా పర్యాటకురాలు మృతి
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో, ఒక ఏనుగు కింద నలిగి తమిళనాడుకు చెందిన ఓ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుబారే ఏనుగుల శిబిరం వద్ద పర్యాటకుల సందడి నెలకొన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) అనే మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం (మే…