భవిష్యత్ యుద్ధాలు కొత్త రూపంలో వస్తాయి.. సిద్ధంగా ఉండాలి: రాజ్నాథ్ సింగ్
విశాఖపట్నం: భవిష్యత్లో ఎదురయ్యే శత్రువులు, యుద్ధాలు ఇప్పటివరకు చూసిన వాటిలా ఉండవని, సరికొత్త రూపంలో సవాళ్లు ఎదురవుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత నౌకాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్ కార్యక్రమానికి ముందు శుక్రవారం విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ కేంద్రంలో నిర్వహించిన ‘బరాఖానా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భౌగోళిక రాజకీయ…