Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..
కులమతాలన్నీ వేరైనా.. మేము భారతీయులమంతా ఒక్కటే అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ తరతరాలుగా స్నేహభావంతో మెలిగే గొప్ప సంప్రదాయానికి ఆయన సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. తన సొంత స్థలంలో హిందూ దైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి, అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరబాదుకు చెందిన మహబూబ్ బాషా, తన కుటుంబానికి చెందిన సొంత…