చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే
ఏలూరు: రిజర్వాయర్ నీటిలో రోజూలాగే ఆ మత్స్యకారుడు వల విసిరాడు.. కానీ ఈసారి నీటి అడుగు నుంచి వచ్చిన బలం జాలర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు కలిసి శ్రమించి ఒడ్డుకు లాగితే కనిపించింది ఒక అరుదైన భారీ మత్స్యం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భారీ బొచ్చె చేప గురించే చర్చ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం, కొంగవారిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయం (ఎర్రకాలువ…